నేడు ఖమ్మంకు రేవంత్ రెడ్డి..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. వచ్చే నెలలో తెలంగాణ లో రాహుల్ పర్యటించబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తెచ్చేందుకు నేతలంతా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం తెలంగాణ ఫై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వరుసగా నేతలతో రాహుల్ గాంధీ సమావేశమై ..కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ తరుణంలో మే 6, 7 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. మే 6న సాయంత్రం 4 గంటలకు వరంగల్లోని ఆర్ట్స్ కాలేజీలో జరిగే రైతు సంఘర్షణ సభకు ఆయన చీఫ్ గెస్ట్గా హాజవ్వనున్నారు. మే 7న రాహుల్గాంధీ హైదరాబాద్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బోయిన్పల్లిలో పార్టీకి చెందిన పదిన్నర ఎకరాల్లో రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ నిర్మాణానికి రాహుల్తో భూమి పూజ చేయించనున్నారు.
అలాగే అక్కడే తెలంగాణ అమర వీరులు, ఆత్మహత్య చేసుకున్న రైతులు, నిరుద్యోగుల కుటుంబాలతో రాహుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కాగా వరంగల్ సభ ను భారీ సక్సెస్ చేసేందుకు నేతలు సన్నాహాలు చేస్తున్నారు. సభ కు ఐదు లక్షల మందిని తీసుకరావాలని చూస్తున్నారు. దీనికి తగ్గట్లే జిల్లాలకు సంబదించిన ఇంచార్జ్ లను నియమించారు. రాహుల్ సభ కంటే ముందు రేవంత్ రెడ్డి జిల్లాలలో పర్యటించి అక్కడి నేతలతో ..కార్యకర్తలతో మాట్లాడి , రాహుల్ సభ ను సక్సెస్ చేయాలనీ కోరుతున్నారు. నిన్న సోమవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించిన రేవంత్..ఈరోజు ఖమ్మం జిల్లాలో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో జనసమీకరణ, సన్నాహక కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో మాట్లాడడనున్నారు.