వరి దీక్ష లో పక్కపక్కనే కూర్చుని పలకరించుకున్న రేవంత్ , కోమటిరెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో… ధాన్యం కొనుగోలు అంశంపై కాంగ్రెస్ పార్టీ శనివారం ఇందిరా పార్క్ దగ్గర వరి దీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దీక్ష లో రేవంత్ , కోమటిరెడ్డి పక్కపక్కనే కూర్చుని పలకరించుకున్నారు. రేవంత్ రెడ్డి పిసిసి అయిన తర్వాత పార్టీకి దూరంగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇవాళ దీక్ష లో మాత్రం పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని వి హనుమంత రావు ఒప్పించి మరి ఈ దీక్ష కేంద్రానికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సన్నిహితంగా మెలిగారు. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ఉదయం హాజరవ్వగా… ఆ తర్వాత కోమటి రెడ్డి వచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ దీక్షలో పాల్గొనడం గమనార్హం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో విభేదాలు లేవని ఈ దీక్ష తో తెలిసిపోతుంది. వరి కొనుగోలు విషయంలో కేసీఆర్ సర్కార్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ, రేపు ధర్నాచౌక్‌లో ‘వరి దీక్ష’ చేపట్టింది. ఈ దీక్షకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా దాదాపు కలిసి వచ్చారు.