కోకాపేట్, ఖానామెట్ భూముల అమ్మకాలపై సీబీఐ డైరెక్టర్ను కలిసిన రేవంత్

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ..దిల్లీలో సీబీఐ డైరెక్టర్ ను కలిశారు. కోకాపేట్, ఖానామెట్ భూముల అమ్మకాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన పిర్యాదు చేసారు. భూముల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్ర ఖజానాకు రూ. వెయ్యి నుంచి 1,500 కోట్ల నష్టం జరిగిందని రేవంత్ ఆరోపించారు.
కోకాపేట్, ఖానామెట్ భూముల టెండర్లలో గోల్మాల్ జరిగింది. దీనికి సహకరించిన అందరిపైన రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను. భాజపా, తెరాస కుమ్మక్కయ్యాయి అనేది నిజం కాకపోతే.. భూముల అమ్మకాలపై సీబీఐ చేత విచారణ జరిపించి.. చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రేవంత్ మీడియా ద్వారా సవాల్ విసిరారు. మొదటి నుండి కూడా రేవంత్ కోకాపేట్, ఖానామెట్ భూముల అమ్మకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు రాహుల్ గాంధీ తో సమావేశమై ..ఆ తర్వాత సీబీఐ డైరెక్టర్ కు పిర్యాదు చేయడం జరిగింది.