నేడు భారత్కు రానున్న తొమ్మిది దేశాల ప్రవాసులు!
న్యూఢిల్లీ: విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కార్యక్రమం ఈరోజునుండి మొదలుకానుంది. మే 7 నుంచి మే 13వ తేదీ వరకు 64 విమానాల్లో 12 దేశాల నుంచి దాదాపు 15 వేల మంది ప్రవాసులు భారత్కు రానున్నారు. మొదటి రోజు తొమ్మిది దేశాల నుంచి ప్రవాసులు భారత్కు చేరుకోనున్నారు. యూఏఈ నుంచి రెండు విమానాలు భారత్కు రానున్నాయి. ఒక్కో విమానంలో దాదాపు 200 మంది ప్యాసెంజర్లు ప్రయాణించనున్నారు. మొత్తంగా దాదాపు 2300 మంది ప్రవాసులు తొమ్మిది దేశాల నుంచి నేడు భారత్కు పయనం కానున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/