దీపావళి పండుగ వేళ..ఏపి ప్రభుత్వం ఆంక్షలు!

టపాసులకు రెండు గంటలు మాత్రమే అనుమతి

Restriction-On-Diwali-Crackers-In-ap

అమరావతి: దీపావళి పండుగ నేపథ్యంలో ఏపి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు ఈ ఆంక్షలు విధిస్తున్నామని, శనివారం నాడు రాత్రిపూట కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసులు పేల్చుకోవాలని సూచించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకూ మాత్రమే టపాకాయలను కాల్చేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. అవి కూడా పర్యావరణానికి మేలు కలిగించే గ్రీన్ క్రాకర్స్ ను మాత్రమే కాల్చాలని, రాష్ట్రంలోని కరోనా బాధితులు, పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఇక టపాకాయలు విక్రయించే షాపుల మధ్య 10 అడుగుల దూరం తప్పనిసరని, కొనుగోలుదారులు కూడా 6 అడుగుల దూరం పాటించేలా చూడాల్సిన బాధ్యత షాపుల యజమానులదేనని వెల్లడించింది. ఈ షాపుల వద్ద పేలుడు స్వభావమున్న శానిటైజర్ లను వాడరాదని తేల్చి చెప్పింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/