రిపబ్లిక్ టీవీ డిస్ట్రిబ్యూషన్ హెడ్ అరెస్ట్
టీఆర్పీ రేటింగ్స్ ను తారుమారు చేశారంటూ ఫిర్యాదుతో కేసు నమోదు
Mumbai: రిపబ్లిక్ టీవీ డిస్ట్రిబ్యూషన్ హెడ్ ఘన్ శ్యామ్సింగ్ ను ముంబై పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు.
టీఆర్పీ రేటింగ్స్ ను తారుమారు చేశారంటూ అందిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టీఆర్పీ అవకతవలకు సంబంధించి ఘన్ శ్యామ్ సింగ్ తో కలిసి ఇప్పటి వరకు మొత్తం 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/