ఢిల్లీ పరేడ్‌లో తెలంగాణ శకటం

Telangana era in Delhi Parade
Telangana era in Delhi Parade

ఢిల్లీ: రాజ్ పథ్ వద్ద నిర్వహించిన పరేడ్‌లో గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటాన్ని ప్రదర్శించారు. ఈ శకటాన్ని తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించిన విషయం తెలిసిందే. బతుకమ్మ, మేడారం జాతర, వేయి స్తంభాల గుడిని ఈ శకటంలో చూపారు. అలాగే గిరిజన సంస్కృతిని చాటి చెప్పే గొండి, తోటి, ప్రదాన్‌, కొమ్ముకోయ, బంజారా కళాకారుల నృత్యాలు ప్రదర్శించారు. 2015లో మొదటిసారి తెలంగాణ శకటాన్ని ప్రదర్శించారు. మళ్లీ ఈ సారి తెలంగాణ శకటం కనపడింది. కాగా, ఈ పరేడ్‌లో భారత సైనికుల శక్తిని దేశం ప్రదర్శించింది. అలాగే, యాంటీ శాటిలైట్ మిసైట్ ఎ శాట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/