ఫిబ్రవరి 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు పునఃప్రారంభం

-మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడి

Primary School Children
Primary School Children-file

Amaravati: విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రాథమిక పాఠశాలలను కూడా తెరవబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఏపీలో వచ్చే నెల నుంచి ప్రాథమిక పాఠశాలలు తెరుచుకోనున్నాయి.

1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి తరగతులు నిర్వహిస్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/