అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షల ఎత్తివేత
కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు
New Delhi: కోవిడ్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం క్రమంగా సడలిస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్రం మరో ప్రకటన చేసింది.
అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలను విధించొద్దని రాష్ట్రాలను, యూటీలను కేంద్రం కోరింది.
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు.
అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/