కరోనా..పతనమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు

చమురు కంపెనీలపై తీవ్ర ప్రభావం

mukesh ambani
mukesh ambani

ముంబయి: కరోనా ప్రభావం చమురు కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ఏకంగా 13.65 శాతం వరకు పడిపోయాయి. గత పదేళ్ల కాలంలో ఒక ఇంట్రాడేలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఈ స్థాయిలో పతనమవడం ఇదే తొలిసారి. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు జామ్ నగర్ లో ప్రపంచంలోనే అతి పెద్ద క్రూడాయిల్ రిఫైనరీ పరిశ్రమ ఉంది. కృష్ణా, గోదావరి బేసిన్ లో పెద్ద ఎత్తున చమురు వెలికితీస్తోంది. ఈ నేపథ్యంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఈరోజు కుప్పకూలాయి. మధ్యాహ్నం 2.14 గంటల సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 12.05 శాతం నష్టంతో రూ. 1,117 వద్ద కొనసాగుతున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/