ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు

అమరావతి : ఏపీ లో గురువారం నుంచి 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షల సడలింపులు అమలు కానున్నాయి. కోవిడ్‌ పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో ప్రభుత్వం సడలింపులిచ్చింది. ఆ 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా అన్నీ మూసివేయాలి. రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.

ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటలవరకే సడలింపు ఉంది. ఈ జిల్లాల్లో సాయంత్రం 6 నుంచి మరుసటిరోజు ఉదయం 6వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. ఈ జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి జులై 7వ తేదీ వరకు తాజా నిర్ణయాలు వర్తిస్తాయి. పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈ జిల్లాల్లో సడలింపుపై మళ్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు విడుదల చేసే అవకాశముంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/