తెలంగాణలో రిజిస్ట్రేషన్లు నిలిపివేత
ఇప్పటికే స్లాట్బుక్ చేసుకున్నవారికి రీషెడ్యూల్ అవకాశం
Hyderabad: తెలంగాణ లో లాక్ డౌన్ నేపథ్యంలో 10 రోజులపాటు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్ ను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కావున ప్రజలు తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రావొద్దని పేర్కొన్నారు. ఇప్పటికే స్లాట్బుక్ చేసుకున్నవారికి రీషెడ్యూల్ అవకాశం కల్పిస్తామని, లాక్డౌన్ అనంతరం వీటిపై మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/