నిమ్మగడ్డ కేసులో హైకోర్టు తీర్పుపై స్టేకు నిరాకరణ

జగన్ సర్కార్ కు సుప్రీంలోనూ చుక్కెదురు

Supreme Court

New Delhi: జగన్ సర్కార్ కు నిమ్మగడ్డ కేసు విషయంలో సుప్రీంలోనూ చుక్కెదురైంది.

ఎస్ఈసీగా నిమ్మగడ్డను కొనసాగించాల్సిందేనన్న హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.

రాజ్యాంగ సంస్థలతో ఆటలొద్దని హెచ్చరించింది. ఆర్డినెన్స్ విషయంలో ప్రభుత్వ ఉద్దేశాలు నమ్మదగినవిగా లేవని సీజేఐ వ్యాఖ్యానించారు.

తాజా ఎన్నారై వార్తల కోసం :https://www.vaartha.com/news/nri/