వైద్యరంగంలో సంస్కరణలు అవసరం
ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కరవు
ఆస్పత్రులు పటిష్టంగా ఉంటేనే ఆరోగ్యరంగం ప్రాణాలు రక్షిస్తుందనే విశ్వాసం వైద్యరంగం మీద ఉంటుంద.ి
ప్రభుత్వాల మీద, ఆరోగ్య నిర్వహణా యంత్రాంగం మీద ప్రజలకు అపారమైన విశ్వాసం పెంచాల్సి ఉందని కరోనా నేపథ్యంలో మరోమారు రుజువైంది.
ఈ రంగం కోసం ఇప్పుడు ఎన్ని నిధులు అయినా వెచ్చించాలి. అధ్వాన్నంగా తయారైన వైద్యరంగాన్ని సంస్కరించాలి. మనకు అవసరమైన ఉత్పత్తులను మనమే తయారుచేసుకునే స్థాయికి రావాలి. స్వయం సమృద్ధి సాధించేలా వైద్యపరికరాలను ఉత్పత్తి చేసుకోవాలి.
ఇంతగా శాస్త్రసాంకేతిక అభివృద్ధి చెందిన దశలో, నైపుణ్యం ఉన్న యువతను వినియోగించుకుని ఆస్పత్రుల రూపురేఖలు మార్చాలి.
సిబ్బంది కొరత, ఉపకరణాల కొరత, బడ్జెట్ కొరత వంటి సమస్యలు లేకుండా చూసుకోవడం మినహా మనకు ఇప్పుడు ప్రాధాన్య అంశాలు ఇతరత్రా ఉండకూడదు.
లా క్డౌన్ ముందునాటి స్థితితో పోలిస్తే కరోనా వైరస్ తీవ్రత అనూహ్యంగా పెరు గుతోంది. రోజుకోరీతిలో దాని లెక్కలు మారుతున్నాయి.
మరణాల సంఖ్యకూడా అలాగే పెరుగుతోంది. ఈ దశలో గణాంకాలు చూసి విశ్లే షిస్తూ కేసుల సంఖ్య తక్కువగా ఉందనో లేక మరణాల రేటు తగ్గిం దనో చెప్పడం సరికాదు.
ప్రజల భయాందోళనలు తొలగించే ప్రయ త్నాలు చేయాలి. ఇది కేంద్ర,రాష్ట్రాల సమిష్టి బాధ్యత.
కేంద్రం నిధులిచ్చినా రాష్ట్రాలు సరిగా వినియోగించడం లేదన్న ఆరోపణలు పక్కన పెట్టి నిధులు ఎంత ఇచ్చిందీ సక్రమంగా చెప్పి వాటిని రాష్ట్రాలు కరోనా నిర్మూలనకు ఉపయోగిస్తున్నాయో లేదో తక్షణ చర్యలకు ఉపక్రమించాలి.
ఇకపోతే దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి నేపథ్యంలో అన్నిరాష్ట్రాలను కలుపుకుని వైద్యసేవలను, చికిత్సలను పటిష్టం చేయాలి. ప్రధాన ఆస్పత్రుల్లో సిబ్బందిని పెంచి, సౌకర్యాలు మెరుగుపర్చాలి.
ఆస్పత్రుల్లో ఫలానది లేదన్న విధంగా పటిష్టం చేసి, ప్రజలకునమ్మకం కలిగించాలి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా వైద్యాన్ని ప్రభుత్వ అజమాయిషిలోకి తీసుకు నిరావాలి.
ఇందుకు అవసరమైన నిధులను కేంద్ర,రాష్ట్రాలు ఖర్చు చేయాలి.
ప్రజల ఆరోగ్యకంకన్నా మరే ఇతర విషయాలు ముఖ్యం కాదు కనుక వైరస్ను ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రాథమిక చికిత్సలకు సంబంధించి లోటు లేకుండా చేయాలి. అవసరమైతే కొన్ని అనవసర పథకాలకు నిధులను ఆపేయాలి.
కరోనాను ఎదుర్కోవడంలో ఇంతవరకూ అనుసరిస్తూ వస్తున్న విధానాల వల్ల లభించిన ఫలితాలనూ, ముఖ్యంగా లాక్డౌన్ తొలగించాక రాష్ట్రా లు పొందిన అనుభవాలనూ పరస్పరం పంచుకోవాలి.
మహమ్మా రిని ఎదుర్కోవడానికి లాక్డౌన్ పర్యవసానంగా స్తంభించిన ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడానికి అమలు చేస్తున్న వ్యూహాల ను సమీక్షించుకోవాలి.
ఇప్పటికీ వ్యాధిగ్రస్తుల శాతం తక్కువగా ఉండటం, వేరే దేశాలతో పోలిస్తే వారిలో కోలుకునేవారి శాతం ఎంతో మెరుగ్గా ఉండటం వంటి విశ్లేషణలను పక్కన పెట్టాలి.
అసలు కరోనాను ఎదుర్కోవడమెలా అందుకు అనుసరించిన వ్యూహాలు విజయం సాధించాయా లేదా అన్న విశ్లేషణ చేయాలి.
కనీవిని ఎరుగని రీతిలో విరుచుకుపడిన కరోనా వైరస్ను ఎదుర్కో వడంలో మనం పాటించిన విధానాల్లో శాస్త్రీయత ఉందో లేదో తెలిసే అవకాశం లేదు. మనకే కాదు ప్రపంచంలో ఏ దేశానికి ఆ వ్యాధి విస్తృతిపై, తీవ్రతపై పూర్తి అవగాహన కలగడం లేదు.
వ్యాధి బయటపడిన చైనా కూడా లాక్డౌన్ ఎత్తేశాక పలుమార్లు మళ్లీ మళ్లీ విధించాల్సివస్తోంది.
ఆచరణలో ఎదురవ్ఞతున్న అనుభ వాలను బట్టి ఎప్పటికప్పుడు దారులుపరుచుకుంటూ ముందుకు పోవడం తప్ప ఎవరికీ తమ విధానాలపైనా, వాటి ఫలితాలపైనా స్పష్టత లేదు.
ఇకపోతే ఇప్పుడు ఎదురవ్ఞతున్న ఆర్థికపరమైన ఇబ్బందుల్ని అధిగమించడానికి కేంద్రం నేరుగా సాయం అందిం చాల్సిఉంది.
ఇకపోతే వైద్యపరంగా మనం ఎంత వెనుకబడి ఉన్నామో, మన ఆరోగ్యరంగం లోటుపాట్లను ఈ కరోనా మహ మ్మారి బయటపెట్టింది.
కొన్ని దశాబ్దాలుగా దేశంలో వైద్య ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిన ఫలితం ఇప్పుడు కొట్టొచ్చినట్టు కనబడు తోంది. చాలాచోట్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సదుపాయాలు లేవు.
ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి చోట్ల ఉన్న ప్రధాన ఆస్పత్రుల్లో కూడా పటిష్టమైన వైద్యసౌకర్యాలు లేవు. చికిత్స అందించడానికి సరిపడా వైద్యులు అందుబాటులో లేరు
. ఇతర మౌలిక సదుపాయాల సంగతి ఇక చెప్పాల్సిన పని లేదని ఇటీవల పరిస్థితులు ప్రజలకు కళ్లకు కట్టాయి. వీటిని అధ్యయనం చేయడం జరిగింది.
కనుక భేషజాలాలకు పోకుండా ఆస్పత్రుల్లో అధునాతన సౌకర్యాలను యుద్ధప్రాతిపదికన సమ కూర్చాలి. ఈ విపత్కర సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సి ఉంది.
కేంద్రం ఎప్పటికప్పుడు ఇస్తున్న మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాల్సిందే. పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోగా, దాన్ని ఎదుర్కోవడానికి మరిన్ని చర్యలు అవసరమని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
వేగంగా వ్యాపిస్తున్న కరోనా వ్యాధి కారణంగా సామాన్యులు ఆందోళన చెందుతున్న వేళ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం అన్నది సిగ్గుచేటు.
వీటిని బాగు చేయడానికి పాలకులు ఎవరు కూడా తమ జేబులో నుంచి రూపాయి ఖర్చు చేయడం లేదు.
అలాంటప్పుడు ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేకుండా చేయడంలో అర్థం లేదు. ఇంతటి భయంకర పరిస్థితుల్లో ఆస్పత్రులు అధ్వాన్నంగా ఉండటం క్షమించదగినది కాదు.
ఏ రాష్ట్రం అయినా ఆస్పత్రులను పటిష్టం చేసి, అధునాతనంగా తీర్చిదిద్దాల్సిందే. బాధ్యతాయుతంగా వ్యవహరించలేని అసమర్థత, అలక్ష్యం ఉన్న ప్రభుత్వాలను నిలదీయాల్సిందే.
వీటన్నిటి కారణంగా ఎవరికి వారే యమునాతీరే లాగా ప్రత్యేక విధానాలను అనుసరిస్తున్నారు.
ఇటువంటి స్థితిని ఎదుర్కోవడంలో ప్రభుత్వా ధినేతలు ఒక సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించ డంలో విఫలమవ్ఞతున్నారు.
ఆయా ప్రభుత్వాలు ప్రజలతో వ్యవహరించే విషయంలో అనుసరిస్తూ వస్తున్న విధానాలు సరిగా ఉండడం లేదని తేలిపోయింది.
ఆస్పత్రులు పటిష్టంగా ఉంటేనే ఆరోగ్యరంగం ప్రాణాలు రక్షిస్తుందనే విశ్వాసం వైద్యరంగం మీద ఉంటుంది.
ప్రభుత్వాల మీద, ఆరోగ్య నిర్వహణా యంత్రాంగం మీద ప్రజలకు అపారమైన విశ్వాసం పెంచాల్సి ఉందని కరోనా నేపథ్యంలో మరోమారు రుజువైంది. ఈ రంగం కోసం ఇప్పుడు ఎన్ని నిధులు అయినా వెచ్చించాలి.
అధ్వాన్నంగా తయారైన వైద్యరంగాన్ని సంస్కరించాలి. మనకు అవసరమైన ఉత్పత్తులను మనమే తయారుచేసుకునే స్థాయికి రావాలి.
స్వయం సమృద్ధి సాధించేలా వైద్యపరికరాలను ఉత్పత్తి చేసుకోవాలి. ఇంతగా శాస్త్రసాంకేతిక అభివృద్ధి చెందిన దశలో, నైపుణ్యం ఉన్న యువ తను వినియోగించుకుని ఆస్పత్రుల రూపురేఖలు మార్చాలి.
సిబ్బంది కొరత, ఉపకరణాల కొరత, బడ్జెట్ కొరత వంటి సమస్యలు లేకుండా చూసుకోవడం మినహా మనకు ఇప్పుడు ప్రాధాన్య అంశాలు ఇతరత్రా ఉండకూడదు.
పరిశీలకులు, నిపు ణులు కేంద్ర బృందం సభ్యులు, న్యాయస్థానాలు పదేపదే చెబు తున్నవేళ కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలి.
ప్రజలకు అనేక సందేహాలు ఉన్న నేపథ్యంలో వారికి భరోసా కల్పించడం ద్వారా కరోనాను సమిష్టిగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కోవాలి.
అందుకు ఆస్పత్రులను పటిష్టం చేయడమే తక్షణ బాధ్యతగా, అవసరంగా గుర్తించాలి.
అలాగే ప్రజలందరికీ అన్ని అవసరాలు అందుబాటులోకి వచ్చేవిధంగా ఈ కరోనా మహమ్మారి అంతమయ్యేంతవరకు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-డాక్టర్. ఎన్.కలీల్
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/