శానిటైజర్‌ల ధరలు తగ్గింపు

కేంద్ర ఆదేశాలనుసారం.. ప్రకటించిన కంపెనీలు

shanitaizer
shanitaizer

ముంబయి: జూన్‌ 30 వరకు శానిటైజర్ల ధరలు నియంత్రణలో ఉంచాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం శానిటైజర్ల ధరలు తగ్గిస్తున్నట్లు ప్రముఖ కంపెనీలు ప్రకటించాయి. దేశంలో కరోనా వైరస్‌ అధికంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం శానిటైజర్ల ధరలను గరిష్టంగా రూ. 100 కు పరిమితం చేయాలని సూచించగా, అందుకు అనుగూణంగా శానిటైజర్ల ధరలను తగ్గిస్తున్నట్లు హిందుస్థాన్‌ యూనీ లీవర్‌, ఐటీసీ, గోద్రెజ్‌, హిమాలయా, డాబర్‌ వంటి పలు ఎఫ్‌ఎంజీసీ కంపెనీలు తెలిపాయి. తాము సూచించిన ధరలకే రిటైల్‌ అమ్మకాలు జరపాలని, డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తిని కూడా పెంచామని, దీనికి దుకాణదారులు సహకరించాలని కోరారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/