ఆంధ్రప్రదేశ్ లో రెడ్ జోన్ ప్రాంతాల వివరాలు
వైద్య ఆరోగ్య శాఖ అధికారిక ట్వీట్
Guntur: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కరాళ నృత్యం చేస్తోంది.
రాష్ట్రంలో పాజిటివ్ కేసులు ఇప్పటికే 500 దాటిపోగా పరిస్థితులు అప్పుడే అదుపులోకి వచ్చేలా కనిపించట్లేదు.
ఈ క్రమంలోనే పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో నివసించేవారిని హెచ్చరిస్తూ.. ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
కరోనా పాజిటివ్ వచ్చిన వారు నివాసం ఉన్న ప్రాంతాలను వెల్లడిస్తూ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది.
ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రాంతాల పేర్లను వివరిస్తూ పోస్ట్ చేసింది. ఈ ప్రాంతాలను రెడ్ జోన్ పరిధిలోకి చేర్చారు.
ఈ పేర్కొ న్న ప్రాంతాలలో ప్రజలు బయటకు రావద్దని సూచించింది..
జిల్లాల వారీగా రెడ్ జోన్ ప్రాంతాల వివరాలు
- ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని ఇస్లాంపేట, మార్కాపురం,
- గుంటూరు నగర పరిధిలోని అరండల్ పేట, సంగడి గుంట, కుమ్మరి బజారు, ఆనంద్ పేట, సుజాతా నగర్, బుచ్చయ్య నగర్, కొరిటపాడు తో పాటు జిల్లా పరిధిలోని దాచేపల్లి, పొన్నూరు, నరసరావుపేట, ఉరువకట్ట, పెడకన.
- కర్నూలు జిల్లా ఆత్మకూరు, కర్నూలు పరిధిలోని గనిగల్లు, బనగానపల్లి మండలంలోని హుసేనాపురం, చాగలమర్రి , నంద్యాల అర్బన్.
- కడప జిల్లా ప్రొద్దుటూరు, బద్వేలు సమీపంలోని మహబూబ్ నగర్,
- చిత్తూరు జిల్లా వడమాలపేట, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో మద్దూరు పరిధిలోని పాణ్యం గ్రామం,
- నెల్లూరు జిల్లా వాకాడు మండల పరిధిలోని తిరుమూరు, తడ మండలంలోని బీవీ పాలెం, నెల్లూరు పరిధిలోని నవాబు పేట, కోటమిట్ట, చంద్రబాబు నగర్, రంగనాయకుల పేట, పెద్ద బజారు,
- పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం,
- కృష్ణా జిల్లా రాణిగారితోట, విజయవాడ పరిధిలోని మాచవరం,
- అనంతపురం జిల్లా హిందూపూర్ మండల పరిధిలోని గూలకుంట గ్రామాలు రెడ్ జోన్ పరిధిలో చేర్చారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/