ప్రకాశం జిల్లాలో ఘోరం : రాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సులు

ప్రకాశం జిల్లాలో సభ్యసమాజం సిగ్గుపడే ఘటన చోటుచేసుకుంది. ఎంతో భక్తి తో జరగాల్సిన విగ్రహ ప్రతిష్ఠ వేదిక ఫై రికార్డింగ్ డ్యాన్సులతో చిందులేశారు. ఈ ఘటన జిల్లాలోని నడింపల్లి గ్రామంలో రామాలయంలో చోటుచేసుకుంది. అధికార పార్టీ నేతల అండదండలతో ఈ రికార్డింగ్ డాన్సులను ఏర్పాటు చేసినట్లు చెపుతున్నారు. భక్తి పాటలు వినిపించాల్సిన చోట.. ఐటెంసాంగ్​లు, డీజీ పాటల మోత మోగటం ఏంటి అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇంత జరుగుతున్నా.. పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ప్రతిదానికి రూల్స్, పర్మిషన్స్ మాట్లాడే పోలీసులు.. ఇప్పుడు ఏమయ్యారని స్థానికులు ప్రశ్నింస్తున్నారు. రికార్డింగ్ డాన్సులు ఏర్పటు చేసిన నిర్వాకులను అదుపులోకి తీసుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ డాన్స్లకు సంబదించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.