అశ్రునయనాల మధ్య ముగిసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు
హైదరాబాద్ః సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య కృష్ణంరాజు అంత్యక్రియలు పూర్తిచేశారు. హీరో ప్రభాస్ సోదరుడు ప్రభోద్ కృష్ణంరాజుకు తలకొరివి పెట్టాడు. కడసారీ వీడ్కోలు పలికేందుకు రెబల్స్టార్ అభిమానులు కనకమామిడి ఫాంహౌజ్కు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో సినీప్రముఖులు, రాజకీయనాయకులు అంతిమ సంస్కారాలకు హాజరైయ్యారు.
కృష్ణంరాజు ఆకస్మిక మరణంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. గత కోంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఆదివారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఈయన మరణం పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం ప్రకటించారు. అంతిమ యాత్రకు ముందు జూబ్లీహిల్స్లోని నివాసంలో ఆయన భౌతిక కాయానికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు నివాళులు అర్పించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/business/