చరణ్ బర్త్ డే వేడుకకు అల్లు అర్జున్ వెళ్లకపోవడానికి కారణాన్ని తెలిపిన అల్లు స్నేహ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే (మార్చి 27) వేడుక హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే అల్లు అర్జున్ ఈ వేడుకకు రాకపోయేసరికి సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ఆయన ఫై ట్రోల్స్ చేయడం , విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అల్లు స్నేహ..అల్లు అర్జున్ వేడుకకు హాజరుకాకపోవడానికి కారణం తెలిపింది.
ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యామిలీ తో కలిసి వియత్నాంలో వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే బన్నీ అండ్ ఫ్యామిలీ వెకేషన్కి వెళ్లారని అందుకనే తను చెర్రీ పార్టీలో కనిపించలేదని తెలిపింది. మరి ట్వీట్ ఎందుకు చేయలేదనే వాదన ఫై కూడా క్లారిటీ ఇచ్చింది. చరణ్, బన్ని డైరెక్ట్గా ఫోన్లోనే మాట్లాడుకుని ఉండుంటారు. అలాంటప్పుడు ట్వీట్ చేయాల్సిన అవసరం ఏముందని తెలిపింది. అలాగే వియత్నాం హోటల్లో ఉన్న వీడియోను ఆమె పోస్ట్ చేసింది. అలాగే మరో ఫొటో కూడా బయటకు వచ్చింది. అందులో అల్లు అర్జున్, స్నేహ, వారి పిల్లలతో పాటు చిరంజీవి కుమార్తెలు కూడా ఉన్నారు.