త్వరలో రియల్మి స్మార్ట్ టీవీలు
ముంబయి: చైనాకు చెందిన మొబైల్ ఫోన్ తయారీ సంస్థ రియల్మి భారత మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులను తీసుకురాబోతుంది. వివిధ రకాల స్మార్ట్టీవీలతో పాటు ఫిట్నెస్ బ్యాండ్ సహా అనేక ఉత్పత్తులను పరిచయం చేయనుంది. ఈ మేరకు సంస్థ సీఈవో మాధవ్ సేథ్ వెల్లడించారు. 2020 ఏడాదిలోనే వీటిని ప్రారంభించాలని యోచిస్తోంది రియల్మి. రియల్మి స్మార్ట్ టీవీలు 2వ క్వార్టర్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని రెగ్యులేటరీ ఆమోదాలు వస్తే ఏప్రిల్ నెలలో కూడా అవకాశం ఉందని చెప్పారు. రియల్మీ- బ్రాండెడ్ ఐఓటి పరికరాలతో పాటు, ఫిట్నెస్ బ్యాండ్ రూపకల్పనపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. రియల్మి స్మార్ట్టీవీలు, ఫిట్నెస్ బ్యాండ్లు సహ అనేక ఉత్పత్తులు విడుదల చేస్తామని తెలిపారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/