బండి సంజయ్ కి రసమయి వార్నింగ్ : మర్యాదగా మాట్లాడకపోతే నాలుకలు తెగ కోస్తా

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు తెరాస ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో రసమయి మీడియా తో మాట్లాడుతూ.. బండి సంజయ్ ది విహారాయత్రనో ? ఎం యాత్రనో ? ఎవరికి తెలియదని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు ఈమధ్య చెప్పుకోలేని విధంగా అసభ్యకరంగా మాటలు మాట్లాడుతున్నారని వాపోయారు.

యాత్ర పేరుతో తిరుగుతున్న బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మానకొండూర్ కు ఎన్ని నిధులు ఇచ్చాడో నియోజకవర్గ ప్రజలకు స్పష్టం చేయాలని తెలిపారు. తాను ఎమ్మెల్యే గా రూ. 20 కోట్ల నిధులు తెచ్చానని.. ఎంపీ బండి సంజయ్ 20 రూపాయలు అయినా ఇచ్చినాడా ? అని నిలదీశారు. బండి సంజయ్ కు బెజ్జంకి మండలంలో అడుగుపెట్టే అర్హత ఉందా ? అని ప్రశ్నించారు. తెరాస సర్కారు ఫై మర్యాదగా మాట్లాడకపోతే నాలుకలు తెగ కోస్తానని హెచ్చరించారు.