ఏపీలో మ‌రో దారుణ ఘ‌ట‌న ..ఒంట‌రిగా ఉంటోన్న మ‌హిళ‌పై అత్యాచారం

గ‌త అర్ధ‌రాత్రి ఆమె ఇంటికి వెళ్లి త‌లుపుకొట్టిన దుండ‌గులు.. ఇంట్లోకి చొర‌బ‌డి అత్యాచారం


విజ‌యన‌గ‌రం: ఏపీలో రేప‌ల్లె రైల్వే స్టేష‌న్‌లో మ‌హిళ‌పై సామూహిక అత్యాచారం జ‌రిగిన ఘ‌ట‌న‌ను మ‌ర‌వ‌క‌ముందే ఏపీలో మ‌రో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇద్ద‌రు పిల్ల‌ల‌తో ఒంట‌రిగా ఉంటోన్న మ‌హిళ‌పై కొంద‌రు దుండ‌గులు అత్యాచారానికి ఒడిగట్టారు.

పార్వతీపురం మ‌న్యం జిల్లా నుంచి ఉపాధి కోసం ఓ మ‌హిళ విజ‌యన‌గ‌రం వ‌చ్చి టీ దుకాణంలో ప‌నిచేస్తోంది. గ‌త అర్ధ‌రాత్రి ఆమె ఇంటికి వెళ్లి త‌లుపుకొట్టిన కొంద‌రు దుండ‌గులు ఆమె ఇంట్లోకి చొర‌బ‌డి అత్యాచారం చేశారు. ఈ రోజు ఉద‌యం బాధిత మ‌హిళ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/