ఎట్టకేలకు రంగమార్తాండ రిలీజ్ డేట్ ప్రకటించారు

సింధూరం , అంతఃపురం , మురారి , నిన్నే పెళ్లాడతా , ఖడ్గం , చందమామ వంటి బ్లాక్ బస్టర్ విజయాలను అందించి ఎన్నో అవార్డ్స్ దక్కించుకున్న డైరెక్టర్ కృష్ణవంశీ..ప్రస్తుతం ఓ హిట్ కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేకపోవడంతో ..ఈయనతో సినిమాలు చేసే నిర్మాతలు సైతం కరువయ్యారు. ప్రస్తుతం రంగమార్తాండ మూవీ పైనే ఈయన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమా మొదలుపెట్టి కూడా చాల కాలమే అవుతుంది. కానీ రిలీజ్ కు బ్రేకులు పడుతూ వస్తుంది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు రిలీజ్ కు సిద్ధమైంది.

ఈ సినిమాని మార్చ్ 22వ తేదీ ధియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగిన మైత్రి మూవీ మేకర్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల రంగమార్తాండ హక్కులు దక్కించుకుందని తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ప్రకాష్ రాజ్ , రమ్య కృష్ణ , బ్రహ్మానందం , అనసూయ , రాహుల్ సిప్లిగంజ్ , శివాత్మిక, ఆదర్శ బాలకృష్ణ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాని హౌస్ ఫుల్ మూవీస్ రాజేష్ శ్యామల ఎంటర్టైన్మెంట్ సమీకంగా నిర్మించాయి. ఈ రంగమార్తాండ సినిమాకు మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.