వివాహ బంధంతో ఒక్కటైన రణ్బీర్ – అలియా
ఎట్టకేలకు బాలీవుడ్ ప్రేమ జంట రణ్బీర్ కపూర్ – అలియా భట్ లు వివాహ బంధంతో ఒకటైయ్యారు. ఈరోజు( ఏప్రిల్ 14న) కొత్త జీవితాన్ని ప్రారంభించారు. పంజాబ్ సంప్రదాయం ప్రకారం.. ఈ వివాహం జరిగింది. బాంద్రాలోని వాస్తు అపార్ట్మెంట్లో జరిగిన ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు , సన్నిహితులతో పాటు నీతూ కపూర్, కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, మహేశ్ భట్, సోనీ రజ్దాన్, షాహీన్ భట్, సైఫ్ అలీఖాన్, ఆకాశ్ అంబానీ తదితరులు హాజరయ్యారు.
పెళ్లికి సంబంధించిన ఫొటోలను అలియా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ఐదు ఏళ్ల రిలేషన్ షిప్ అనంతరం ఏప్రిల్ 14న బంధువులు, స్నేహితుల సమక్షంలో మేం పెళ్లి చేసుకున్నాం. జంటగా మరెన్నో అనుభూతులను పంచుకోవడానికి మేం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. ఈ క్షణం మాకెంతో ప్రత్యేకమైనది’’ అని అలియా భట్ తెలిపింది. ఆలియా తల్లిదండ్రులు, రణ్బీర్ కుటుంబసభ్యులు దగ్గరుండి పెళ్లి పనులను చూసుకున్నారు. ఈ పెళ్లి వేడుక కు సంబంధించిన విషయాలు బయటకు రావద్దని అలియా – రణ్ బీర్ అవసరమైన చర్యలు తీసుకున్నారు. పెళ్లి మండపానికి కెమెరాలు గానీ, సెల్ ఫోన్ లను గానీ అనుమతించలేదు. కేవలం అలియా – రణ్ బీర్ అధికారికంగా నియమించుకున్న కెమెరా మినహా.. మిగితా వాటికి అనుమతి ఇవ్వలేదు. పెళ్లి తంతూ ముగిసిన అనంతరం అలియా – రణ్ బీర్ తమ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.