షాక్ : సినీ ఇండస్ట్రీలో విషాదం

చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. రీసెంట్ గా బాలీవుడ్ యాక్టర్ సిద్ధార్ధ్ శుక్లా మృతి చెందగా..ఇక ఇప్పుడు మలయాళ నటుడు రమేష్ వలీయశాల (54) మరణించారు. సెప్టెంబర్ 11 ఉదయం 10 గంటల సమయంలో తిరువనంతపురంలోని తన నివాసంలో ఆయన ఉరి వేసుకుని మృతి చెందారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఇది ఆత్మహత్య అని వెల్లడైంది. అయితే మంచి భవిష్యత్ ఉన్న నటుడు ఇలా ఉరివేసుకోవడం ఫై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటన తాలూకు విషయాలు తెలిసి ఆయన అభిమానులు షాక్‌ అయ్యారు. రమేష్ మరణాన్ని అసహజ మరణం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత 22 సంవత్సరాలుగా సీరియల్ ఇండస్ట్రీలో పని చేస్తున్న రమేష్.. పలు సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాంటి ఈయన ఉరివేసుకొని చనిపోవడంఅందర్నీ షాక్ కు గురి చేస్తుంది. ఈయన మరణం ఫై అంత సంతాపం వ్యక్తం చేస్తున్నారు.