రమేష్ బాబు అంత్యక్రియలకు వచ్చేవారికి ఘట్టమనేని ఫ్యామిలీ విన్నపం

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు..శనివారం రాత్రి తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా కాలేయ సమస్య తో బాధపడుతున్న రమేష్ బాబు..శనివారం ఆయన ఆరోగ్యం విషయం కావడం తో హైదరాబాద్ లోని ఏఐజి ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించగా..ఆయన అక్కడికి వెళ్లేలోపై చనిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.

ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు జూబ్లీహిల్స్​ మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు జరగనున్నాయి. ఏఐజీ ఆస్పత్రిలో ఉన్న రమేశ్​ భౌతికకాయాన్ని.. కుటుంబసభ్యుల సందర్శనార్థం మరికాసేపట్లో పద్మాలయ స్టూడియోకు తరలించనున్నారు. కాగా, అంత్యక్రియల సమయంలో అభిమానులు గుమికూడకుండా ఉండాలని కోరింది ఘట్టమనేని కుటుంబం. ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.

ఇక రమేష్ బాబు అంత్యక్రియలకు ఆయన తమ్ముడు మహేష్ బాబు రాలేకపోతున్నారు. దీనికి కారణం ఆయన కరోనా బారినపడడమే. జనవరి 07 న మహేష్ కరోనా టెస్ట్ చేసుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో డాక్టర్స్ సలహా మేరకు ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నారు. ఈ కారణంగా అన్న రమేష్‌ బాబు అంత్యక్రియలకు మహేష్‌ బాబు దూరం కానున్నాడు. ఇక రమేష్ బాబు ‘అల్లూరి సీతారామరాజు’ (1974) చిత్రం ద్వారా చిత్రసీమలోకి అడుగుపెట్టారు. కృష్ణ, మహేశ్‌బాబుతో కలిసి పలు సినిమాల్లో నటించారు. సుమారు 15 చిత్రాల్లో ఆయన కీలకపాత్రలో పోషించారు. 1997 నుంచి నటనకు దూరంగా ఉన్న రమేశ్‌బాబు 2004లో నిర్మాతగా మారారు. ‘అర్జున్‌’, ‘అతిథి’ సినిమాలు నిర్మించారు.