రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ ‘తెలిసిన వాళ్లు’

పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీ

A Still From Telisina Valle movie
A Still From Telisina Vallu movie

రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా సిరింజ్ సినిమా బ్యానర్‌పై వస్తున్న సినిమా తెలిసిన వాళ్లు. ఈ సినిమాను విప్లవ్ కోనేటి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. దీనికి అనూహ్య స్పందన వస్తుంది. రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. విప్లవ్ కోనేటి ఈ సినిమాను తెరకెక్కిస్తూ.. నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు.. అనంత్ నాగ్, అజయ్ నాగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. సినిమాలో విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు మేకర్స్. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/