24న రష్యా వెళ్లనున్న మంత్రి రాజ్‌నాథ్

ర‌ష్యా విక్ట‌రీ డే ప‌రేడ్‌ వేడుకల్లో పాల్గొననున్న మంత్రి

Rajnath Singh
Rajnath Singh

న్యూఢిల్లీ: ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ ఈనెల 24వ తేదీన ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో జ‌ర‌గ‌నున్న విక్ట‌రీ డే ప‌రేడ్ వేడుక‌ల్లో పాల్గొన‌నున్నారు. ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రి సెర్గీ షోయ్‌గు.. రాజ్‌నాథ్‌ను ఈ ప‌రేడ్‌కు ఆహ్వానించారు. కాగా రెండ‌వ ప్ర‌పంచ యుద్ధంలో విజ‌యం సాధించి 75 ఏళ్లు పూర్తి అయిన సంద‌ర్భంగా ప్ర‌త్యేక ప‌రేడ్‌ను నిర్వ‌హించ‌నున్నారు. భార‌త్‌కు చెందిన 75 మంది మిలిట‌రీ బృందం కూడా ఈ ప‌రేడ్‌లో పాల్గొంటున్న‌ది. ర‌ష్యాతో పాటు మిత్ర దేశాలు క‌న‌బ‌రిచిన సాహ‌సం, త్యాగాల‌ను స్మ‌రిస్తూ విక్ట‌రీ డే ప‌రేడ్‌ను నిర్వ‌హించ‌నున్నారు. వాస్త‌వానికి మే 9వ తేదీన విక్ట‌రీ డే జ‌ర‌గాల్సి ఉంది. కానీ క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఆ వేడుక‌ల‌ను వాయిదావేశారు.భార‌త‌ ద‌ళానికి సిక్కు ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌కు చెందిన మేజ‌ర్ ర్యాంక్ ఆఫీస‌ర్ నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధంలో సిక్కు రెజిమెంట్ పాల్గొన్న‌ది. సిక్కు రెజిమెంట్‌కు నాలుగు యుద్ధ అవార్డులు ల‌భించాయి.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/