నిర్మాతను ఆదుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్
ఎవరు ఆపదలో ఉన్న..ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న వారికీ సాయం అందించడంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పుడు ముందుంటారు. తాజాగా అలాంటి సాయమే తన నిర్మాతకు చేసి వార్తల్లో నిలిచాడు. రజని నటించిన ‘బాబా’ చిత్రానికి వీఏ దురై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పని చేశారు. ఆ సినిమాకి గానూ దురై రూ.51 లక్షల వరకూ పారితోషికం అందుకున్నారు. అంతేకాకుండా.. ‘ఎన్నమ కన్ను’, ‘లూటు2, ‘పితామగన్’, ‘గజేంద్రన్’, ‘నాయికుట్టి’ వంటి అనేక చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈయన పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడం తో అనారోగ్యానికి గురయ్యాడు.
ప్రస్తుతం అనారోగ్యానికి చికిత్స తీసుకోడానికి కూడా ఆయన దగ్గర డబ్బు లేదు. దీంతో తమిళ సినీ పరిశ్రమలోని ప్రముఖుల సహాయాన్ని కోరారు. ఈ విషయం తెలిసిన రజనీకాంత్ వెంటనే ఆయన్ని ఫోన్లో సంప్రదించి సహాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ‘జైలర్’ సినిమాతో బిజీగా ఉన్నానని , షూటింగ్ పూర్తి కాగానే కలుస్తానని రజనీకాంత్ చెప్పిన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి తన టీం ద్వారా కొంత డబ్బుని పంపించడం జరిగిందట. అలాగే సూర్య సైతం తనవంతుగా రూ.2 లక్షలు విరాళం ఇచ్చారు. సూర్య గతంలో నటించిన ‘పితామగన్’కి దురైనే నిర్మాతగా వ్యవహరించారు.