రాజేంద్రనగర్ లో దారుణం : రోడ్డు పక్కన వెళ్తున్న యువతిని కారుతో గుద్ది చంపబోయారు

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో దారుణం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన వెళ్తున్న యువతిని కారుతో గుద్ది చంపబోయారు. యువతిని ఢీ కొట్టిన వెంటనే అదే కారుతో పారిపోయారు. ఈ ఘటన అంతా సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది. రక్తపు మడుగుల్లో రోడ్డు ఫై పడి పోయిన యువతిని స్థానికులు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ చెపుతున్నారు.

పోలీసులు మాత్రం రోడ్డు ప్రమాదం గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ సీసీ ఫూటేజ్ లో మాత్రం స్పష్టంగా రోడ్డు పక్క నుండి నడుచుకుంటూ వెళుతున్న యువతిని కారు తో ఢీ కొట్టి పారిపోయినట్లు తెలుస్తోంది. రోడ్డు పై కారు ముందుకు తీసుకొని వెళ్లి రివర్స్ చేసి మరి ఎదురుగా వస్తున్న యువతిని ఢీ కొట్టారు. ఈ వ్యవహారం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అది రోడ్డు ప్రమాదమా..? లేక హత్య అనే విషయాన్ని పోలీసులు తేల్చాల్సి ఉంది. కుటుంబ సభ్యులు కూడా రోడ్డు ప్రమాదం జరిగినట్లు ఫిర్యాదు చేయడం పలు అనుమానాలకు దారి తీస్తుంది.