రాజాసింగ్ అరెస్ట్ కు నిరసనగా బైంసా లో బంద్

గోషా మహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టును నిరసిస్తూ..ఈరోజు (శనివారం) భైంసా పట్టణ బంద్ కు పిలుపునిచ్చారు. ఉదయం నుండే స్వచ్ఛదంగా అన్ని షాప్స్ , స్కూల్స్ , కాలేజీలు మూసివేశారు. బంద్ నేపథ్యంలో ఎలాంటి ఉద్రికత్త ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. మరోపక్క హైదరాబాద్ లోని బేగంబజార్, ముక్తార్ గంజ్, మహారాజ్ గంజ్, కిషన్ గంజ్ తదితర మార్కెట్లో ఉన్న దాదాపు 1వెయ్యికి పైగా దుకాణాలు స్వచ్చందంగా ముసివేసి రాజాసింగ్‌కు మద్దతు పలికారు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాజాసింగ్‌ ఫై పోలీసులు పీడియాక్ట్‌ నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. మంగళ్‌హాట్‌ పీఎస్‌లో రాజాసింగ్‌పై రౌడీషీట్‌ నమోదై ఉంది. 2004 నుంచి రాజాసింగ్‌పై 101 కేసులు ఉండగా, వాటిపై 18 మతపరమైన కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రెండు కేసుల్లో రాజాసింగ్‌కు నోటీసులు ఇచ్చి అరెస్ట్‌ చేశారు పోలీసులు. అందులో ఒకటి ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణ. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన మంగళ్‌హాట్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. మరోకేసు షాహీనాత్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌ 12వ తేదీన నమోదైంది. శ్రీరామ నవమి సందర్భంగా ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా రాజాసింగ్‌ పాటలు పాడారన్న ఆరోపణలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.