కొనసాగుతున్న రాజశ్యామల యాగం

rajashyamala-yagam-continue-in-brs-party-office-in-delhi

న్యూఢిల్లీః బిఆర్‌ఎస్‌ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ సిఎం కెసిఆర్ ఢిల్లీలో నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం కొనసాగుతున్నది. ఈ రాజశ్యామల యాగం కోసం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక యాగశాలను నిర్మించారు. అధినేత కెసిఆర్‌తోపాటు పలువురు బిఆర్‌ఎస్‌ నేతలు ఈ రాజశ్యామల యాగానికి హాజరయ్యారు.

ఈ యాగం మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. 12 మంది ఋత్విక్కులు గణపతి పూజతో రాజశ్యామల యాగానికి శ్రీకారం చుట్టారు. యాగం కోసం 12 మంది ఋత్విక్కులు సోమవారమే ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం పుణ్యహవాచనం, యాగశాల ప్రవేశం, చండీపారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహించారు. ఈరోజు నవ చండీహోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శృంగేరిపీఠం గోపీకృష్ణశర్మ, ఫణి శశాంకశర్మ ఆధ్వర్యంలో యాగాలు జరుగుతున్నాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/