పార్టీ శ్రేణులకు రజనీకాంత్ పిలుపు
2021లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ ఆర్ఎంఎం (రజనీ మక్కల్ మన్రం) పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంస్థ జిల్లా కార్యదర్శులతో చెన్నైలో ప్రత్యేకంగా సమావేశమైన రజనీ, పలు అంశాలపై వారితో చర్చించారు. 2021లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తన శ్రేణులకు పిలుపునిచ్చారు. కాగా ఎన్నికల్లో కమలహాసన్ తో కలసి వెళ్లాలా? వద్దా? అన్న విషయంపైనా చర్చ జరిగింది. ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు, ఓటములు ఎలా ఉంటాయన్న అంశంపైనా రజనీ సలహాలు అడిగారు. ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా, పోటీకి సిద్ధంగా ఉండాలని రజనీ కోరారు. ఇక ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రజనీ, తమ సమావేశంలో చాలా విషయాలను చర్చించుకున్నామని అన్నారు. తన సంస్థ స్థానిక నేతలంతా ఈ భేటీపై సంతృప్తిగా ఉన్నారని, అయితే, ఓ విషయంలో మాత్రం తాను మోసపోయానన్న భావనలో ఉన్నానని, దాని గురించి ఇప్పుడే చెప్పలేనని, సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/