రాహుల్ సభకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరం..

ఈరోజు సాయంత్రం హన్మకొండ లో కాంగ్రెస్ పార్టీ ‘రైతు సంఘర్షణ’ పేరుతో భారీ సభ నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సభ కు రాహుల్ గాంధీ హాజరుకాబోతున్నారు. కాగా ఈ సభ ను భారీ సక్సెస్ చేసి కార్య కర్తల్లో కొత్త ఉత్సహం తీసుకరావాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటె ఈ స‌భ‌కు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి దూరంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

పార్టీపై గత కొంత కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. గతంలో సీఎల్పీ పదవి ఆశించిన రాజగోపాల్ రెడ్డి అది దక్కకపోవడంతో పార్టీపై గుర్రుగా ఉన్నారు. ఇదిలా ఉంటే రాజగోపాల్ రెడ్డి అన్న వెంకట్ రెడ్డి మాత్రం రాహుల్ సభ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఇటీవల సన్నాహక సమావేశాల్లో కూడా రాజగోపాల్ రెడ్డి పాల్గొనలేదు. గతంలో బీజేపీ అనుకూల వ్యాఖ్యలు కూడా చేశారు రాజగోపాల్ రెడ్డి. ఈనేపథ్యంలో త్వరలో పార్టీ మారుతారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే ఈరోజు వరంగల్ లో జరిగే సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.