కేసీఆర్‌ బూటకపు మాటలను ప్రజలు నమ్మరు – రాజగోపాల్ రెడ్డి

టిఆర్ఎస్ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘సీఎం కేసీఆర్‌ బూటకపు మాటలపైన ప్రజలకు నమ్మకం పోయింది. నా పదవి త్యాగంతో ప్రజలు నా వైపు ఉన్నారు. ప్రజలు డబుల్ ఇంజన్ సర్కారు వైపు మొగ్గుచూపుతున్నారు. మునుగోడు ప్రజల తీర్పు చరిత్ర సృష్టిస్తుంది. మునుగోడులో ఓటమి భయంతోనే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు సిద్దమయ్యే అవకాశం ఉంది’ అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

బుధవారం చౌటుప్పల్ మండలం, తుఫ్రాన్‌పేట్‌లో కార్యకర్తలు.. రాజగోపాల్‌ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం, రాజగోపాల్‌ రెడ్డి.. గణేషుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా రాజగోపాల్ రెడ్డిపై వ్యాఖ్యలు చేసారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో​ పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. అన్ని రాజకీయ పార్టీలు మునుగోడుపైనే ఫోకస్‌ పెట్టాయి. అధికార టీఆర్‌ఎస్‌ మునుగోడు ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుంది.