తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ : రేపటి నుండి రైతుబంధు డబ్బులు జమ

తెలంగాణ రైతన్నలకు గుడ్ న్యూస్..రేపటి నుండి (డిసెంబర్ 15) రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. దీనికి సంబంధించిన నిధుల పంపిణీ అంశంపై అధికారులు ఇప్పటికే దృష్టి పెట్టారు. ఇందుకోసం ఇప్పటికే ఏడున్నర వేల కోట్ల నిధులను… సర్దుబాటు చేసేందుకు ఆర్థిక శాఖ అధికారులు సిద్ధమయ్యారు.

రేపటి నుంచి.. ఈ నెల చివరి వరకు రైతుబంధు డబ్బులను… రైతుల ఖాతాల్లో వేయనున్నట్లు తెలుస్తోంది. గత వానాకాలం సీజన్ లో మొదటి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు.. రెండో రోజు రెండు ఎకరాలు, మూడో రోజు మూడు ఎకరాలు ఉన్న వారికి రైతుబంధు నగదును ఖాతాల్లో బదిలీ చేశారు. ఈ యాసంగి సీజన్ లోనూ అదే పద్ధతిని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.