మండే ఎండల్లో ఆంద్రప్రదేశ్ కు చల్లటి వార్త

వివిధ జిల్లాల్లో నాలుగు రోజుల పాటు వర్ష సూచన

Rainfall forecast in Andhra Pradesh
Rainfall forecast in Andhra Pradesh

Visakhapatnam: బంగాళా ఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవ నున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖ, ఉభయగోదావరి,, ఉత్తరాంద్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమ, కోస్తా, జిల్లాల్లో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/