తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ

హైదరాబాద్ : ఈనెలాఖరున కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నట్లు సమాచారం. రాహుల్ గాంధీ టూర్ పై టీపీసీసీ ప్లాన్ డిజైన్ చేసింది. రెండు రోజుల పాటు పర్యటన ఉండేలా కసరత్తు చేస్తున్నారు. వరంగల్ లో సభ నిర్వహించేందుకు టీపీసీసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. సభ అనంతరం హైదరాబాద్ లో పార్టీ నేతలతో రాహుల్ గాంధీ సమావేశముండే అవకాశముంది. రాహుల్ టూర్ ప్లాన్ ను టీ పీసీసీ ఏఐసీసీకి పంపింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/