తెలంగాణలో ఆరో రోజు కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర

Rahul Padayatra is going on for sixth day in Telangana

హైదరాబాద్ః తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆరో రోజు కొనసాగుతోంది. ఈరోజు షాద్ నగర్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఇవాళ లింగారెడ్డి గూడ, చాంద్రాయణ గూడ, కొత్తూరు మీదుగా పెద్దషాపూర్, ముచ్చింతల వరకు యాత్ర కొనసాగనుంది. రాహుల్ ఇవాళ దాదాపు 28 కిలోమీటర్ల మేర నడవనున్నారు. రాత్రికి శంషాబాద్ తొండుపల్లి వద్ద రాహుల్ బస చేయనున్నారు.

54 రోజుల క్రితం కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ ప్రారంభించిన పాదయాత్ర ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ వర్గాల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బిజెపి, టిఆర్ఎస్ లపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న ఆయన.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంస్థల ప్రైవేటీకరణకు చెక్ పెట్టడంతో పాటు రాష్ట్రంలో ధరణి పోర్టల్ ను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. టిఆర్ఎస్ ప్రభుత్వం లాక్కున్న దళిత, గిరిజనుల భూములు తిరిగి ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/