ఆరెంజ్ క్యాప్ విన్నర్ రాహుల్
ఐపీఎల్ 2020లో అత్యధిక పరుగులు
యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020లో అత్యధిక పరుగులు చేసిన కేఎల్ రాహుల్కు ఆరేంజ్ క్యాప్ సొంతమైంది.
13వ సీజన్లో ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్లను పరిశీలిస్తే ఆరెంజ్ క్యాప్ కోసం ప్రధానంగా కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ పోటీపడ్డారు.
వీరిలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు సారథిగా వ్యవహరించిన కేఎల్ రాహుల్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండటంతో అతడికే ఆరేంజ్ క్యాప్ దక్కింది.
14మ్యాచ్ల్లో రాహుల్ 129.34 స్ట్రైక్రేటుతో 670పరుగులు చేశాడు. రెండోస్థానంలో ఢిల్లిd క్యాపిటల్స్ ఓపెనర్ గబ్బర్ ఉన్నాడు. శిఖర్ ధావన్ 618పరుగులు చేసి ద్వితీయస్థానంలో నిలిచాడు.
వీరి తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 16 మ్యాచ్ల్లో 134.64 స్ట్రైక్రేటుతో 548 పరుగులతో మూడోస్థానంలో ఉన్నాడు.
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/