లాక్డౌన్ ఎత్తివేత పై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి
వలసకూలీల తరలింపుపై వ్యూహాత్మకంగా వ్యవహరించాలి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లో మీడియాతో మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం కరోనా నుంచి ఎదురుక్కోనేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి సూచించారు. వలసకూలీల తరలింపుపై వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఆయన చెప్పారు. కష్టసమయంలో పేదలు, కార్మికులకు సాయం చేయాలని, దినసరి కూలీలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వలస కూలీలకు త్వరగా ఆర్థిక సాయం చేయాలని రాహుల్ గాంధీ సూచించారు. కాగా లాక్డౌన్ ఎత్తేసే విషయంపై ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. ఏ ప్రాతిపదికన, ఏయే జాగ్రత్తలు తీసుకుంటూ లాక్డౌన్ ఎత్తేస్తున్నామన్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసి, ఆ తర్వాతే ఆంక్షలు తొలగించాలని రాహుల్ గాంధీ చెప్పారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/