ఫిబ్రవరి 1న బడ్జెట్‌..రాహుల్ గాంధీ ట్వీట్

గతంలో దేశ జీడీపీ 7.5 శాతం

ఇప్పుడు మాత్రం జీడీపీ 3.5 శాతం

Rahul Gandhi
Rahul Gandhi

న్యూఢిల్లీ: మోడి ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈనేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ‘మోడితో పాటు ఆయనకు తగ్గ ఆర్థిక సలహాదారుల బృందం ఆర్థిక వ్యవస్థను తారుమారు చేసింది’ అంటూ విమర్శలు గుప్పించారు. గతంలో దేశ జీడీపీ 7.5 శాతంగా, ద్రవ్యోల్బణం 3.5 శాతంగా ఉండేదని పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రం జీడీపీ 3.5 శాతంగా, ద్రవ్యోల్బణం 7.5 శాతంగా ఉందని విమర్శించారు. కుదేలైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు తదుపరి ఏం చేయాలన్న విషయంపై ప్రధాని మోడి తో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వద్ద ఎటువంటి పరిష్కారం మార్గం లేదని ఆయన ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 1 పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/