రహదారిపైనే రాహుల్ గాంధీ పుష్ అప్ లు..

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. ప్రతి చోట ఆయనకు నీరాజనాలు పలుకుతున్నారు. దీంతో రాహుల్ రెట్టింపు ఉత్సహంతో పాదయాత్ర ను కొనసాగిస్తున్నారు. కాగా ఈ పాదయాత్రలో కొన్ని సంఘటనలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా కర్ణాటకలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ రహదారిపైనే పుష్ అప్ లు తీసి అందరినీ ఆశ్చర్యపర్చే ప్రయత్నం చేశారు.

52 సంవత్సరాల రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న సమయంలో పుష్ అప్ లు తీసి అక్కడున్న కార్యకర్తలతో పాటు నాయకుల్లోనూ ఎంతో ఉత్సహన్ని నింపారు. ఓ బాలుడితో కలిసి రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డీకే శివకుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పుష్ అప్ లు తీసిన ఫొటోను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రణ్ దీప్ సూర్జేవాలా ట్విట్టర్ లో షేర్ చేశారు. ’ రాహుల్ పుష్ అప్ ఛాలెంజ్’ క్యాప్షన్ తో సోషల్ మీడియాలో షేర్ చేయగా..ఇది వైరల్ గా మారింది.