టిఆర్ఎస్‭తో పొత్తు ఉండదుః రాహుల్ గాంధీ

rahul-gandhi-press-meet-in-thimmapur

హైదరాబాద్ః బిజెపి, టిఆర్‌ఎస్‌లు కలిసి ఒకరిద్దరికే కాంట్రాక్టర్లు కట్టబెడుతున్నాయని ఆరోపించారు. అందుకే యువకు ఉపాధి అవకాశాలు కరువయ్యాయని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను ప్రణాళిక బద్ధంగా నాశనం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. అందుకే యువకు ఉపాధి అవకాశాలు కరువయ్యాయని ఆయన చెప్పారు. జోడో యాత్ర కొత్తూరుకు చేరుకున్న సందర్బంగా ఆయన మాట్లాడారు. ఫిట్నెస్ కోసం అయితే జిమ్ చేస్తే సరిపోతుంది.. పాదయాత్ర చేయాల్సిన పనిలేదన్నారు. దేశ మనుగడ కోసం భారత్ జోడో యాత్ర చేస్తున్నామని అన్నారు. రాజకీయం, ఎన్నికల కోసం యాత్ర చేయడం లేదన్న ఆయన.. ప్రజల మధ్య సోదర భావం పెంచేందుకే చేస్తున్నామని చెప్పారు. మరోవైపు ఓబీసీ చేపట్టిన జనాభా లెక్కల గణాంకాలను బహిరంగ పరచాలని రాహుల్ గాంధీ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎన్నికలు నిర్వహించిన తర్వాతే.. ఏఐసీసీ ప్రెసిడెంట్ ను ఎన్నుకుందని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తోందని.. ఇతర పార్టీల్లో ఆ ప్రజాస్వామ్యం లేదని ఆయన విమర్శించారు. అవినీతి సొమ్ముతోనే బీజేపీ టీఆర్ఎస్‭లు.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. ఇక పొత్తు గురించి ప్రస్తావించిన ఆయన.. టీఆర్ఎస్‭తో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. తెలంగాణ సీఎం జాతీయ పార్టీ, అంతర్జాతీయ పార్టీ పెట్టుకోవచ్చన్నారు. అయితే రెండు సిద్ధాంతాల మధ్యే పోటీ జరుగుతోందని ఆయన చెప్పారు. దేశాన్ని విడగొట్టే వాళ్ళు, జోడించే వాళ్ల మధ్యే పోటీ జరుగుతోందన్నారు. విపక్షాల మధ్య ఐక్యత రావాలని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/