ఇండోర్‌లో భారత్ జోడో యాత్ర.. రాహుల్ గాంధీకి బాంబు బెదిరింపు లేఖ

Bomb Threat To Rahul Gandhi: Letter Threatening To Blow Congress Leader With Explosion During Bharat Jodo

న్యూఢిల్లీః కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా ఇండోర్ చేరుకున్నారు. అయితే రాహుల్ గాంధీకి ప్రాణహానికి సంబంధించి బెదిరింపులు వచ్చాయి. బాంబులతో చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. జోడో యాత్ర సాగే మార్గంలోని ఓ స్వీట్ షాప్‌లో బెదిరింపు లేఖ వదిలి వెళ్లారు దుండగులు. ఈ లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. రాహుల్ గాంధీ భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. స్వీట్ షాపులో లేఖను వదిలి వెళ్లిన వ్యక్తి కోసం ఇండోర్ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది వెతుకుతున్నారు. జూని ఇండోర్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తున్నారు పోలీసులు.

కాగా, నవంబర్ 24న రాహుల్ గాంధీ ఇండోర్‌లోని ఖల్సా స్టేడియంలో రాత్రి విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో బాంబ్ బెదిరింపుల లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. అయితే, ఈ లేఖను ఎవరో తుంటరి వాళ్లు చేసిన పనిగా భావిస్తున్నారు పోలీసులు. అయినప్పటికీ పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టారు అధికారులు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది.. విచారణ చేపట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/