రైతులకు బాసటగా ఉంటాను: రాహుల్

భారత్‌ బంద్‌కు రాహుల్ గాంధీ మద్దతు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రైతు సంఘాలు సోమవారంనాడు ఇచ్చిన భారత్ బంద్‌కు మద్దతు ప్రకటించారు. రైతులు చేపట్టిన అహింసాయుత సత్యాగ్రహం నేటికీ యథాతథంగా కొనసాగుతోందని అన్నారు. ప్రభుత్వం వంచనకు పాల్పడుతూనే ఉన్నందున రైతులు ఈరోజు భారత్‌ బంద్‌కు దిగారని పేర్కొన్నారు. ”రైతులకు బాసటగా ఉంటాను” అని రాహుల్ ఓ ట్వీట్‌లో ప్రకటించారు.


సాగు చట్టాలను కేంద్ర ఆమోదించి ఏడాదైన సందర్భంగా ఆ చట్టాలను రద్దు చేయాలంటూ రైతు సంఘాల కూటమి సంయుక్త కిసాన్ మోర్చా ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చింది. భారత్ బంద్‌కు సీపీఎం, సీపీఐ, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాది పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ (సెక్యులర్), బహుజన్ సమజ్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, డీఎంకే, సాద్-సంయుక్త్, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, జార్ఖాండ్ ముక్తి మోర్చా, రాష్ట్రీయ జనతా దళ్, సర్వాజ్ ఇండియా తదితర పార్టీలు మద్దతు ప్రకటించారు. బంద్‌కు 500కు పైగా రైతు సంస్థలు, 15 ట్రేడ్ యూనియర్లు, ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకూ బంద్ కొనసాగనుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/