టీఆర్ఎస్ తో పొత్తుపై రాహుల్ క్లారిటీ ..

హన్మకొండ లో కాంగ్రెస్ పార్టీ ఏర్పటు చేసిన రైతు సంఘర్షణ సభ అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ అయ్యింది. కార్య కర్తలు పెద్ద ఎత్తున సభ కు హాజరయ్యారు. ఈ సభ లో రాహుల్ పొత్తులపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణను దోచుకున్న వ్యక్తితో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఒప్పందం చేసుకోదని, టీఆర్ఎస్ తో కాంగ్రెస్ ఎలాంటి పొత్తు పెట్టుకోదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

పార్టీ నేతలు, కార్యకర్తలందరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని, ఇకపై ఏ నాయకుడైనా ఈ ప్రశ్న అడిగితే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని రాహుల్ వార్నింగ్ ఇచ్చారు. ఎంత పెద్ద నేత అయినా పార్టీ నుంచి బయటకు పంపుతామని, అలాంటి ఆలోచన ఉన్నవారు టీఆర్ఎస్ పార్టీలోకో బీజేపీలోకో వెళ్లిపొండని మండిపడ్డారు. తెలంగాణ రైతులు, యువత నుంచి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తిని క్షమించే ప్రసక్తేలేదని, ప్రజల కోసం పోరాడిన వారికే ఎన్నికల టికెట్ ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు.