కేరళలో 19వ రోజు కొనసాగుతున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

rahul-gandhi-bharat-jodo-yatra-is-on-its-19th-day-in-kerala

షోరనూర్ః కేరళలో పాలక్కడ్ జిల్లా షోరనూర్ నుంచి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ 19వ రోజు భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో స్థానికులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మోడీ ప్రభుత్వంలో సామాన్య జనం బతికే పరిస్థితి లేదని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి పేదవారి నడ్డి విరిచారని ఆరోపించారు. 2014 లో 410 రూపాయలున్న సిలిండర్ ధర… ఇప్పుడు 1200 వందలు చేశారని రాహుల్ గాంధీ మండిపడ్డారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/