విద్వేషాన్ని వదిలేయండి సోషల్ మీడియాను కాదు
మోడికి రాహుల్ హితవు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి సోషల్ మీడియా నుండి తప్పుకోవాలనుకుంటున్నట్లు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. వదిలేయాల్సింది సోషల్ మీడియాను కాదని, విద్వేషాన్ని వదిలేయాలని రాహుల్ హితవు పలికారు. అటు, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా ప్రధాని నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేశారు. మన ప్రధాని అకౌంట్ ను ఎవరూ హ్యాక్ చేయలేదు కదా! అంటూ చమత్కరించారు. లేకపోతే, డిజిటల్ మాలిన్యాలను తొలగించే సున్నితమైన ప్రక్రియ గురించి ఏమైనా సంకేతాలు ఇస్తున్నారా? అంటూ సందేహం వ్యక్తం చేశారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయoడి:https://www.vaartha.com/news/sports/