ఫస్ట్ టైం రాహుల్ యాత్ర లో జాకెట్ ధరించాడు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గత నాల్గు నెలలుగా భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వరకు కేవలం టి షర్ట్ లోనే యాత్ర సాగిస్తున్న వస్తున్న రాహుల్..ఫస్ట్ టైం జాకెట్ ధరించి కనిపించాడు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్ముకశ్మీర్లో కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా ఎముకలు కొరికే చలిలోనూ రాహుల్.. టీ షర్ట్ ధరించి జోడో యాత్రలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాహుల్ మొదటిసారి జాకెట్ ధరించి యాత్రలో పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలో చలి తీవ్రత బాగా పెరిగింది. ఉత్తరాదిలో అయితే పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోయాయి. జనం చలికి గజగజ వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం జమ్ములోని కతువాలో తన నడకను కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ.. జాకెట్ ధరించి కనిపించారు. అలాగే యాత్రలో రాహుల్ వేసుకున్న టి షర్ట్ లపై కూడా పెద్ద రగడే నడిచిన సంగతి తెలిసిందే. రాహుల్ యాత్రపై కన్నా ఆయన వేసుకున్న టీషర్ట్ పైనే ఎక్కువ చర్చ జరిగింది.. టీషర్ట్ ధర ఎక్కువని, టీషర్ట్ లోపల థర్మల్ ఉంచుకున్నారని విమర్శలు వచ్చాయి.